Tresa । ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తమను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 150 మంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. తిరుగు బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్నామని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేసారు. వారిని సముదాయించి, వారితో సుదీర్ఘంగా చర్చించిన ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ తదితరులు అనంతరం వారందరిని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. వారితో మాట్లాడిన మంత్రి వివిధ కేడర్ల బదిలీలు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల/ రికార్డు అసిస్టెంట్ల బదిలీలపై సానుకూలంగా స్పందించి త్వరలో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు ఉపాధ్యక్షులు కె. నిరంజన్, బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రశేఖర్, మధుకర్, నిర్మల్ అధ్యక్షులు వెంకట రమణ,వివిధ జిల్లాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.
Tresa । తహసీల్దార్ల ఎన్నికల బదిలీలు చేపట్టాలని పొంగులేటికి ట్రెసా ప్రతినిధి బృందం విజ్ఞప్తి
ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తమను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 150 మంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు.

Latest News
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్