Telangana Global Rising Summit 2047| తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 20247 అట్టహాసంగా ఇంకాసేపట్లో ప్రారంభకానుంది. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను అవిష్కరిస్తారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 20247 Telangana Global Rising Summit 2047అట్టహాసంగా ఇంకాసేపట్లో ప్రారంభకానుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ(Hyderabad Future City)లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ( Governor Jishnu Dev Verma) ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddyతో కలిసి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. ప్రారంభోత్సవ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను అవిష్కరిస్తారు.
ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, వంతార, VinGroup ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
తొలి రోజున జరిగే ప్యానెల్ డిస్కషన్ల వివరాలు
తొలి రోజున ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే వివిధ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు కొనసాగుతాయి. గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గర ప్రధాన వేదికగా సమాంతరంగా ఏర్పాటు చేసిన నాలుగు మీటింగ్ హాల్స్లో ఈ ప్యానెల్ డిస్కషన్లు కొనసాగుతాయి. తొలి రోజున 12 అంశాలపై ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాలు.. విభిన్న అంశాలపై ఇందులో చర్చిస్తారు. సంబంధిత శాఖల మంత్రుల సారధ్యంలో ఆయా రంగాల నిపుణులు, మేధావులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
_______
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సీఎం షెడ్యూల్
3 గంటల నుండి 4 గంటల వరకు మొదటి సెషన్ హాల్ 1:
The Just Transition into 2047 – Powering Telangana’s Future – తెలంగాణ భవిష్యత్తు ఇంధనం.. గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు
హాల్ 2: Green Mobility 2047 – Zero Emission Vehicles ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్-ఎమిషన్ టెక్నాలజీ
హాల్ 3: Tech Telangana 2047 – Semiconductors & Frontier Technologies
సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు
హాల్ 4: Telangana as a Global Education Hub
విద్యా రంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దే వ్యూహం
______
4:15 నుంచి 5:15 వరకు రెండో సెషన్
హాల్ 1: Telangana Flying High – The Rise of Aerospace & Defence – ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధిపై చర్చ.
హాల్ 2: Talent Mobility (TOMCOM & MEA) – అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపై చర్చ.
హాల్ 3: A Healthy Telangana for Prosperous Telangana” – ఆరోగ్యరంగం అభివృద్ధి దిశగా చర్చ.
హాల్ 4: Korea (4:10–4:50 PM),
Australia (4:50–5:30 PM) ఆ రెండు దేశాలతో వివిధ రంగాల్లో సాంకేతిక, నైపుణ్యాల సహకారం, పెట్టుబడి భాగస్వామ్యంపై చర్చలు
______
5:30 నుంచి 6:30 వరకు మూడో సెషన్
హాల్ 1: Telangana Partnering with ASEAN Tigers – ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై చర్చ.
హాల్ 2: Gig Economy – Rise of Fluid Careers
గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ.
హాల్ 3: The RARE Strategy – Increasing Farmers Income through Value Chains
రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాలపై చర్చ.
హాల్ 4: Canada Session,
Fostering Entrepreneurship in Women – రెండు సెషన్లు.. కెనడాతో వివిధ రంగాల్లో సహకార భాగస్వామ్యాలు, పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారత.
గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీకి వెళ్లే హైదరాబాద్లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, US కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయనున్నారు. గూగుల్ స్ట్రీట్ పేరుతో ఒక రహదారి, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ల పేర్ల పరిశీలిస్తున్నారు. రోడ్ల పేర్లకు సంబంధించిన నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాయనుంది. అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram