పరిష్కార మార్గాలు అందించాలని ఆదేశాలు
విధాత, హైదరాబాద్ : వీధి కుక్కల దాడుల్లో చనిపోతున్న చిన్నారులు మరణాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరష్కార మార్గాలను అన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కలు స్వైరవిహారం ఎక్కువైందని హైకోర్టు అభిప్రాయపడింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.జీహెచ్ఎంసీ పరిధిలో 3లక్షల 80వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాటన్నింటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా వీధి కుక్కల దాడులపై సీఎం రేవంత్రెడ్డి తాజాగా స్పందిస్తూ ఇందుకు కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు సూచించాలంటూ కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. ఇదే సమయంలో హైకోర్టు సైతం ప్రభుత్వానికి పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. ఇకనైనా వీధి కుక్కల దాడుల సమస్య పరిష్కారంలో పురోగతి రావాలని పట్టణ వాసులు ఆశిస్తున్నారు.