ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం కర్రెగుట్టలపై తడపాల గ్రామానికి వెళ్లే కాలిబాట దారిలో మందుపాతరలను అమరుస్తుండగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను గురువారం పట్టుకొని వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ తుపాకి, నాలుగు కిట్' బ్యాగులు, రెండు వాకి టాకీలు, పేలుడు సామాగ్రిని ములుగు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
విధాత, వరంగల్ ప్రతినిధి:
తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం కర్రెగుట్టలపై తడపాల గ్రామానికి వెళ్లే కాలిబాట దారిలో మందుపాతరలను అమరుస్తుండగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను గురువారం పట్టుకొని వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ తుపాకి, నాలుగు కిట్’ బ్యాగులు, రెండు వాకి టాకీలు, పేలుడు సామాగ్రిని ములుగు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలు, పోలీసులు అటవీ ప్రాతంలోకి రాకుండా వారిని చంపాలనే ఉద్దేశ్యంతో అక్కడ కాలిబాటల వెంబడి మందుపాతరలు అమరుస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.
ఇందులో వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ డిప్యూటీ దళ కమాండర్ రీతాతో పాటు ఇద్దరు దళ సభ్యులు, ముగ్గురు మిలిషియా సభ్యులు ఉన్నారు.ఈ సందర్భంగా మందుపాతరలను అమర్చడానికి వీరు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విజయవంతంగా అడ్డుకున్నారు.
పట్టుబడిన వారిలో 1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్. 2) సోడి కోసి @ మోతే D/o అడమాలు. పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు, ౩) సోడి విజయ్ @ ఇడుమ S / o జోగ, 1 “బెటాలియన్ సభ్యుడు. 4) కుడం దస్రు s/o గంగ, మిలిషియా సభ్యుడు. 5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు. 6) మడకం భీమ 5/ O కోస, మిలిషియా సభ్యుడు ఉన్నారు. మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న వారు జనజీవన స్రవంతిలో కలిసి, పోలీస్ ఎదుట స్వచ్చందంగా లొంగిపోవాలని వారికీ ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని ములుగు పోలీసులు తెలిపారు.