ఎమ్మెల్సీలుగా వారిద్ధరూ ప్రమాణ స్వీకారం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నారకుంట నవీన్‌ కుమార్‌ రెడ్డి, వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)లు గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

  • Publish Date - June 13, 2024 / 01:54 PM IST

స్థానిక కోటా ఎమ్మెల్సీగా నవీన్‌కుమార్‌రెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న

విధాత, హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నారకుంట నవీన్‌ కుమార్‌ రెడ్డి, వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)లు గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్‌లో కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. నవీన్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు.

 

 

Latest News