నగదు రెట్టింపు చేస్తామని మోసం.. నిందితుల అరెస్టు

నగదును రెట్టింపు చేస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఈ నెల 22న ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీరామోజు రామాచారిని ముఠా సభ్యులు కలిశారు.

నగదు రెట్టింపు చేస్తామని మోసం.. నిందితుల అరెస్టు

విధాత : నగదును రెట్టింపు చేస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఈ నెల 22న ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీరామోజు రామాచారిని ముఠా సభ్యులు కలిశారు. అతని దగ్గర ఉన్న నగదు రెట్టింపు చేస్తామని నమ్మించారు. కాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేష్ యాదవ్ గతంలో చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేసినాడు. ఆ సమయంలో చందనపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామోజు రామాచారి ఇల్లును కట్టడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో వారి మాటలు నమ్మాడు. ఒకటి రెండు ఐదు వందల నోట్లను పైన పెట్టి లోపల నకిలీ నోట్లు పెట్టి రామాచారి కి అందించారు.

ఇలారామాచారి వద్ద నుంచి రూ.33లక్షలు తీసుకొని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్లగొండ రైల్వే స్టేషన్‌లో నిన్న బీహార్‌కు చెందిన నిందితులు సిరాజ్‌, నరేష్ యాదవ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.24 లక్షలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . పరారీలో ఉన్న మరో నిందితుడు ఆఫ్తాబ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.