Telangana Tourism | సాయిబాబా భక్తులకు శుభవార్త.. రెండురోజుల షిర్డీ టూర్‌ ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం

Telangana Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండురోజుల ఎయిర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే షిర్డీ వెళ్లి తిరిగి రావాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ ఉపయుక్తంగా ఉండనున్నది. షిర్డీ ఫ్లైట్‌ ప్యాకేజీ తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణం ఉంటుంది.

  • Publish Date - April 21, 2024 / 11:49 AM IST

Telangana Tourism | షిర్డీ సాయిబాబా భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండురోజుల ఎయిర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే షిర్డీ వెళ్లి తిరిగి రావాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ ఉపయుక్తంగా ఉండనున్నది. షిర్డీ ఫ్లైట్‌ ప్యాకేజీ తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణం ఉంటుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. 2.50 గంటలకు షిర్డీకి చేరుకుంటారు. 3.30 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం బాబా దర్శనానికి వెళ్తారు. దర్శనాల తర్వాత సాయంత్రం 7గంటల నుంచి 7.30 గంటల మధ్య థీమ్‌ పార్క్‌ షోలో పాల్గొనవచ్చు.

ఆ తర్వాత షాపింగ్‌ చేసుకునేందుకు సమయం ఉటుంది. రాత్రి 9 గంటల తర్వాత హోటల్‌కు చేరుకుంటారు. రెండోరోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత పంచముఖి గణపతి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి పాత షిర్డీకి చేరుకొని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కండోబా మందిర్‌కు వెళ్తారు. సాయి తీర్థ్‌ను సందర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.30 హోటల్‌కు చేరుకొని మళ్లీ విమానాశ్రయానికి చేరుతారు. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ప్యాకేజీలో రూ.12,499 చెల్లించాల్సి ఉంటుంది. విమానం టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది. వివరాల కోసం వెబ్‌సైట్‌ tourism.telangana.gov.inతో పాటు 9848540371 నంబ‌ర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది.

Latest News