విధాత: ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సంస్థ నుంచి నేను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం లిఖిత పూర్వ కంగా అధికారులకు రాసి ఇచ్చారు.
ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున సంస్థపై అదనపు ఆర్థిక భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకు న్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలు అని బాజిరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్ నిర్ణయంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.