విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన […]
విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి.