పాన్‌- ఆధార్‌ గడువు పెంపు

విధాత: పాన్‌ కార్డు, ఆధార్‌ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ★ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ★ సెప్టెంబర్‌ 30ని తాజాగా గడువుగా పేర్కొంది. ★ గతంలో విధించిన గడువు జూన్‌ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. ★ పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు. ★ తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, తర్వాత […]

పాన్‌- ఆధార్‌ గడువు పెంపు

విధాత: పాన్‌ కార్డు, ఆధార్‌ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది.

★ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

★ సెప్టెంబర్‌ 30ని తాజాగా గడువుగా పేర్కొంది.

★ గతంలో విధించిన గడువు జూన్‌ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది.

★ పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు.

★ తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్‌ 30కి మరోసారి కేంద్రం పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చింది.

పాన్‌- ఆధార్‌తో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

★ ఉద్యోగి కొవిడ్‌ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

★ అలాగే, కొవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది.

★ వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును మరో రెండు నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

★ ఫారం-16లోని టీడీఎస్‌ సర్టిఫికెట్‌ను ఉద్యోగులకు అందించే గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తు్న్నట్లు కేంద్రం పేర్కొంది.