డబ్బులు, బంగారాన్ని ఇంట్లో ఉన్న బీరువాల్నో లేదా ఇతర రహస్య ప్రదేశాల్లో ఒకేచోట దాస్తుంటారు. ఇలా నగదు, నగలు ఒకేచోట దాచడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు, బంగారం ఒకే చోట దాచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.
కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటారు. నిత్యం కష్టపడుతూ నాలుగు డబ్బులు, కొంత బంగారం సంపాదిస్తారు. ఆ డబ్బులు, బంగారాన్ని ఇంట్లో ఉన్న బీరువాల్నో లేదా ఇతర రహస్య ప్రదేశాల్లో ఒకేచోట దాస్తుంటారు. ఇలా నగదు, నగలు ఒకేచోట దాచడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు, బంగారం ఒకే చోట దాచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వేర్వేరుగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎరుపు రంగు కలిగిన 4 గురివింద గింజలు తీసుకుని వాటిని డబ్బు దాచుకునే బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనం పొదుపుగా వాడుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఏ ఇంట్లో అయితే నీళ్లను అధికంగా ఉపయోగిస్తారో.. ఆ ఇంట్లో సంపద త్వరగా ఖర్చవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుళాయిలు లీకేజీలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బొట్టు బొట్టు పడి పాత్రలు నిండిపోతాయి. ఆ మాదిరిగానే సంపాదన కరిగిపోయి, ఖర్చులు పెరుగుతాయంటున్నారు. ఎవరైతే నీటిని పొదుపుగా వాడుతారో.. వారిపై లక్ష్మీదేవి ప్రభావం ఎక్కువగా ఉంటుందట.
ఉత్తర దిశలో మట్టితో చేసిన బొమ్మలు మాత్రం ఎప్పుడూ ఉంచకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించడం మంచిది. మట్టితో చేసినవి, ఉత్తర దిశ- ఈ రెండూ దురదృష్టాన్ని ఇస్తాయి. దానికి కారణం అది కుబేర స్థానం. కుబేరుడు ఐశ్వర్య కారకుడు. కాబట్టి ఎప్పుడూ కూడా మట్టికి సంబంధించిన వస్తువులు ఉత్తరంలో ఉండకూడదు.