విధాత:తిరుపతి బస్టాండ్ ను 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్ గా ప్రతిపాదనలు చేపట్టారు,కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు.
తిరుమలకు 50,ఇతర ప్రాంతాలకు 50 బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తిరుమల ఘాట్ రోడ్ లో బ్యాటరీ వాహనాల ఆర్టీసీ బస్సులు నడవడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లే అవుతుందని ఆయన పేర్కొన్నారు.
థర్డ్ వేవ్ కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం.ఏసీ బస్సులతో పాటు ప్రతి బస్సును శానిటైజ్ చేస్తున్నాం.మాస్కులు ధరిస్తేనే ఆర్టీసీ బస్సులోకి ఎక్కనిస్తున్నాం.తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.