బాపట్లలో విషాదం.. నాగరాజు కాలువలో నలుగురు యువకుల గల్లంతు

బాపట్ల పట్టణ శివారులోని సూర్యలంక సమీపంలోని నాగరాజు కాలువలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు.

  • Publish Date - May 29, 2024 / 02:59 PM IST

మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు

విధాత : బాపట్ల పట్టణ శివారులోని సూర్యలంక సమీపంలోని నాగరాజు కాలువలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ కూకట్‌ల్లికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు నాగరాజు కాలువలో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉదృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సన్నీ, సునీల్ మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Latest News