విధాత: జగన్ సర్కార్ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోంది.గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక ఏమనాలి?