కేంద్రం నుండి రావాల్సిన నిధులపై బీజేపీ నేతలు మాట్లాడరే .. మల్లాది విష్ణు

విధాత:వినాయక చవితి నేపద్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు.సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అద్దు అదుపు లేదు.నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదు.ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ జీవో ఇచ్చారు.కోవిడ్ నేపద్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారు.కరోనా వల్లే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రజలను […]

  • Publish Date - September 5, 2021 / 11:38 AM IST

విధాత:వినాయక చవితి నేపద్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు.సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అద్దు అదుపు లేదు.నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదు.ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ జీవో ఇచ్చారు.కోవిడ్ నేపద్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారు.కరోనా వల్లే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించలేదు.ప్రజల మేలు కోసమే వినాయక దినోత్సవాన్ని ఇళ్లలో జరుపుకోవాలని సూచించాం.

అన్ని పండుగలకు పోలీసులు మాస్ గేదరింగ్ లు లేకుండా చూస్తున్నారు.వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడరు.గంగానదిలో కృష్ణా నదిలో జగన్ పుణ్య స్నానాలు ఆచరించారు.ప్రతీ దేవాలయంలో జగన్ భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తారు.రంజాన్, బక్రీద్ పండుగలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే జీవోలను ఇచ్చింది.పోలీసులు హిందువులను అరెస్టు చేస్తారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.గతంలో దేవాలయాల ఘటనపై సీబీఐ ఎంక్వైరీ వేయమంటే కేంద్రం స్పందించలేదని నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలను జగన్ సమానంగా చూస్తారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యలు చేశారు.