విధాత: ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టిఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ మధ్యలో పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగితా […]
విధాత: ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టిఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ, ఏపీ మధ్యలో పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగితా వాహనాలు కూడా నిలిచిపోతాయన్నారు. ఏపీ ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తింస్తాయని ఆయన తెలిపారు.