ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే

విధాత‌:కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.వైకాపా ప్రభుత్వంలో రైతులు, సామాన్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆయ‌న‌ ఆగ్రహించారు.కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిని సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి […]

  • Publish Date - July 14, 2021 / 05:46 PM IST

విధాత‌:కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.వైకాపా ప్రభుత్వంలో రైతులు, సామాన్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆయ‌న‌ ఆగ్రహించారు.కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిని సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు (కొల్లు రవీంద్ర మామ) కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెదేపా శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్జన్యం

పండించిన ధాన్యం కొని రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.ఎవరైనా డబ్బు అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్జన్యం చేస్తున్నారని ఆక్షేపించారు.తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని కొంత వరకే పాలించగలరని.. రైతులు తిరగబడితే పారిపోతారని హెచ్చరించారు. కేసులకు తాము భయపడే పరిస్థితే లేదన్నారు.ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. పోలీసులు కూడా హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పనిచేయాలన్నారు. ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు పోయారని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అధికారులను హెచ్చరించారు.

న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం…

పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన పోరాడతామని చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిగెత్తించిన పోలవరాన్ని పడుకోపెట్టారని ఆయన మండిపడ్డారు. పునరావాసం ఇవ్వకుండా గిరిజనుల్ని గోదావరిలో ముంచుతున్నారన్నారు. అడవిని నమ్ముకున్న గిరిజనులు కొండెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భూభాగంపై నీరుపరిస్తే ఇబ్బందులు అని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి

ఎన్నికలు ముందు తనను ఓడించేందుకు కేసీఆర్, జగన్ లు నీటి సమస్య పరిష్కారానికి ఎందుకు కలసి మాట్లాడుకోవట్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నీరన్నింటినీ పులిచింతలలో వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే సీఎం జగన్‌ ఎందుకు బాధ్యత తీసుకుని కేసీఆర్ తో మాట్లాడట్లేదని ప్రశ్నించారు. నీటిని వృధాగా సముద్రపాలు చేసే అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి నీటి సమస్యే తాను సీఎంగా ఉన్నప్పుడు తలెత్తితే వెంటనే కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరించామని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల్ని కాపాడుకుంటూనే ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చన్న చంద్రబాబు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు.అంతకు ముందు మచిలీపట్నం చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు రోడ్డుపైకి తరలివచ్చారు. తెదేపా శ్రేణులు రాకతో చంద్రబాబు కాన్వాయ్‌ను నిలిపి వాహనం నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.