విధాత : ఈ నెల 8 వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం పెద్ద హాలులో ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ ప్రతి ఏటా ఇస్తున్న వార్షిక కళా పురస్కారాన్ని 2021 సంవత్సరానికి ప్రజా వాగ్గేయకారుడు , తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు గోరెటి వెంకన్నకి అందజేయనున్నట్టు ట్రస్టు కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఓ ప్రకటనలో తెలిపారు . ఈ పురస్కారం కింద పదివేల నగదు , జ్ఞాపిక […]
విధాత : ఈ నెల 8 వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం పెద్ద హాలులో ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ ప్రతి ఏటా ఇస్తున్న వార్షిక కళా పురస్కారాన్ని 2021 సంవత్సరానికి ప్రజా వాగ్గేయకారుడు , తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు గోరెటి వెంకన్నకి అందజేయనున్నట్టు ట్రస్టు కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఓ ప్రకటనలో తెలిపారు .
ఈ పురస్కారం కింద పదివేల నగదు , జ్ఞాపిక , దుశ్శాలువా తో ఘనంగా సత్కారం చేసయనున్నారు . ఈ సభకు యు.పి. ఎస్.సి. పూర్వ సభ్యులు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహిస్తారు . రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, ప్రత్యేక ఆహ్వానితులుగా పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరుకానున్నారని తెలిపారు .