టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించి మళ్లీ కొత్త హామీలతో మరో మోసానికి తెరలేపాడని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు
విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించి మళ్లీ కొత్త హామీలతో మరో మోసానికి తెరలేపాడని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మంగళవారం కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేదని అన్నారు, 2014లో జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పే చంద్రబాబు మోసం చేశారని. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా కేవలం 31వేల ఉద్యోగాలిస్తే.. మన వైసీపీ ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ చంద్రబాబు బోగస్ రిపోర్టు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగెస్ రిపోర్టు అనేది చూడాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్కు ఓటేస్తే పధకాలన్ని కొనసాగుతాయిని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని పేర్కొన్నారు. 2014లో ఇంటింటికి జాబ్ , నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడికి 74 ఏండ్ల వయసు వచ్చినా కూడా చేసిన తప్పులపై ఆయనలో కనీసం పశ్చాతాపం కనిపించడం లేదని జగన్ విమర్శించారు. 58 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, గ్రామ గ్రామన ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలను అందించామని వెల్లడించారు. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులు నిర్ణయించేవని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని వివరించారు. నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు నమ్మాలన్నారు. చంద్రబాబుకి ఓటిస్తే చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుందన్నారు.
రైతులు..మహిళల సంక్షేమానికి ప్రాథాన్యత
చంద్రబాబు రైతు రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదని, సబ్సిడీలు ఎగవేశాడని, మహిళలకు సున్నా వడ్డీ ఇసస్తామని ఇవ్వలేదనన్నారు. వ్యవసాయం దండగా అన్నాడని, బషీర్ బాగ్లో రైతులపై కాల్పులు జరిపాడని, ఉచిత కరెంటును విమర్శించిన బాబు చరిత్ర బోగస్ రిపోర్టు అని జగన్ ఆరోపించారు. మీ బిడ్డ జగన్ రైతులకు రైతు భరోసా ఇచ్చాడని, పెట్టుబడికి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చామని, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ అమలు చేశాడని, ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్ అని తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో మీ బిడ్డ పాలనలో వలంటీర్లు మన ఇంటికి రావాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా, మన అస్పత్రులు, బడులు బాగుపడాలన్నా, ప్రతి ఒక్కరం ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలని, 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని కోరారు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింకిలో ఉండాలని జగన్ తెలిపారు.