విధాత:స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ తో కలిసి పలు దస్త్రాలు, సిబ్బంది హాజరు పరిశీలన.సచివాలయంలో వివిధ పనుల కోసం వచ్చిన లబ్ధిదారులతో సేవల అందుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్న కృష్ణ దాస్.
తాసిల్దార్ సుధాసాగర్, సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై,జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణం,రీ సర్వే తదితర అంశాల గురించి ప్రశ్నలు వేసిన మంత్రివర్యులు.గ్రామ సచివాలయం బాగా పనిచేస్తుంది అంటూ కితాబు.సత్వర సేవలు అందించి సచివాలయంల ఏర్పాటు ద్వారా అనుకున్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సిబ్బందికి సూచించిన కృష్ణదాస్.