విధాత: రాయలసీమ మనుగడకు అత్యంత కీలకమైన కృష్ణా నదీజలాల విషయమై నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజలు మౌనం వీడి సీమ భవిష్యత్తు కోసం పోరాటాలకు సిద్దం కావాలని
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
రాయలసీమ వాటర్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నాడు ప్రెస్ క్లబ్ లో రాయలసీమ వాటర్ ఫోరం సభ్యులు లోచర్ల విజయ భాస్కరరెడ్డి అధ్యక్షతన సమాలోచన కొనసాగింది.ఈ సందర్భంగా వివిధ పార్టీలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజక్టులు పూర్తి చేసి బ్రిజేష్ కమిటీ ద్వారా నికరజలాలు కేటాయించాలని కోరారు.విభజన చట్టంలో పేర్కొన్న కరువుపీడిత ప్రాంత ప్రాజక్టులను తక్షణం పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని కోరారు.
హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్ట్ లను అనుమతులు పొందిన ప్రాజక్టులుగా కె.ఆర్.యం.బి నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.
పార్లమెంటులో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పై నాలుగు ప్రాజక్టులను పూర్తి చేసి, నికరజలాల కేటాయింపుల కోసం కార్యాచరణ చేపట్టాలి.రాష్ట్ర విభజన కంటే ముందే అంతర్గత సర్దుబాడులతో నిర్మాణం చేసిన ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం లిప్ట్ లను అనుమంతించిన ప్రాజక్టు లుగా కె.ఆర్.యం.బి లో చేర్చాలి.
తుంగభద్ర హైలెవల్ సమాంతర కాలువ, వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు ప్రాజక్టులను నిర్మాణం చేపట్టాలి.రాయలసీమ హెచ్.యల్.సి, యల్.యల్.సి, కె.సి కెనాల్ లకు కేటాయించిన నికరజలాలను సాగునీటికి పూర్తిగా వినియోగించి, తాగునీటికి, పరిశ్రమలకు ప్రత్యేకంగా నీటిని కేటాయించాలి.తెలంగా రాష్ట్రం ఏర్పడే సందర్భంలో పొలవరం ప్రాజక్టుకు పూర్తి సమ్మతిని చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజక్టు ద్వారా ఆదా అయ్యే నీటిని అడ్డంకులు లేకుండా నిర్మాణంలో ఉన్న సీమ ప్రాజక్టులకు కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రాజక్టుల కు బచావత్ అవార్డు కేటాయించిన 512 టి.యం.సీలలో అంతర్గత సర్దుబాటుల ద్వారా వెనుకబడిన ప్రాంత ప్రాజక్టులకు అదనంగా కేటాయించాలి.కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్రాన్ని కర్నూలు లో ఏర్పాటు చేయాలి.సంప్రదాయ సాగునీటి వనరుల సంరక్షణ కోసం ప్రత్యేక సాగునీటి కమీషన్ ఏర్పాటు చేయాలి.రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజిని సమగ్రంగా అమలు చేసి జీవావరణ, పర్యావరణాన్ని కాపాడాలి.