విధాత:గుంటూరు జిల్లా వినుకొండలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కోర్డు ఉత్తర్వులతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు.గుంటూరు జిల్లా వినుకొండలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్డు ఉత్తర్వులతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు.నేటి ఉదయం వినుకొండలోని సురేశ్ మహల్రోడ్డులో అక్రమ నిర్మాణాలను తొలగించటానికి మున్సిపల్ అధికారులు జేసీబీతో వెళ్లి సగానికి పైగా నిర్మాణాలను కూల్చివేశారు. కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.