జగన్ కేసులపై రోజువారి విచారణ చేపట్టాలి .. సీబీఐకి హైకోర్టు ఆదేశం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
విధాత,హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని జగన్ న్యాయవాదులను ఆదేశించింది. జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram