వైఎస్‌ను తిడుతుంటే గాజులు తొడుక్కున్నారా? మంత్రుల‌పై జేసీ ఆగ్రహం

అనంతపురం,విధాత‌: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేశాడు… రాక్షసుడు అంటూ తెలంగాణ నేత‌లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ […]

  • Publish Date - July 5, 2021 / 06:47 AM IST

అనంతపురం,విధాత‌: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేశాడు… రాక్షసుడు అంటూ తెలంగాణ నేత‌లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బండ బూతులు తిట్టే మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు.

ReadMore:జ‌ల‌వివాదాల‌పై జ‌గ‌న్ మెత‌క‌వైఖ‌రి- క‌న్నా