విధాత: జనసేన రాష్ట్ర నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.భవిష్యత్తు పోరాట కార్యాచరణ పై చర్చ,JSP for AP ROADS పేరుతో రోడ్ల పరిశీలన పోస్టర్ ని ఆవిష్కరించిన మనోహర్,రాష్ట్రం లో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు,లక్షా 26వేల కిలో మీటర్లు రాష్ట్ర రహదారులు దెబ్బ తిన్నాయి.
ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదు,12, 450కోట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించారు,1340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటారు.మరి పనులు ఎక్కడ, కాంట్రాక్టర్ లు ఏరి ఇది కూడా పెద్ద స్కాం గా మేము అనుమానిస్తున్నాం.మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నా… గోతుల రోడ్లు కనిపించడం లేదా వాహన మిత్ర స్కీం పెట్టి… పదివేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని, మూడింతలు ఖర్చు అవుతుంది.
3,600కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారన్నారు మరి ఇప్పుడు రోడ్ల దుస్థితి పై ఎందుకు పాదయాత్ర చేయరు,దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులు ను అడ్డం పెట్టుకుని సిఎం వెళుతున్నారు,మా కార్యకర్త ప్లకార్డు చేతబడితే కేసులు పెట్టారు.
రోడ్ల పరిస్థితి పై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు,సెప్టెంబరు,2,3, 4తేదీలతో ఈ వీడియో లు అందరకీ ప్రదర్శిస్తాం ఆ తరువాత ప్రభుత్వం స్పందించాలని నెల రోజుల పాటు వేచి చూస్తాం.అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమ దానం తో బాగు చేస్తాం ప్రతి నియోజకవర్గం లో ఈ కార్యక్రమాలు వరుసగా ఉంటాయి.JSP for AP ROADS పేరుతో రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తాం బిజెపి, జనసేన కలిసే పని చేస్తాయి అభిప్రాయ బేధాలు ఉండోచ్చు.. కానీ… అంతరాలు లేవు అని వెల్లడించారు.