విధాత: మంగళవారం ఎస్వీయూ సెనెట్ హాల్ లో జరిగిన జిల్లా సమీక్షా కమీటీ సమావేశం చిత్తూరు జిల్లా ఇన్ చార్జి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఆయన మాట్లాడుతూ 3 రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీఎం ఎక్కడి నుండి పరిపాలిస్తే అదే రాజధాని,అది విశాఖ కావచ్చు.. ఇంకొకటీ కావచ్చు అని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్. ఈకార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు, తిరుపతి పార్లమెంటు సభ్యులు,ఎమ్మేల్యేలు,జిల్లా అధికారులు.