లోకేశ్: డేటా విప్లవంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటాం
విధాత: డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎపి రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందన్నారు.ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుందని ఆయన అన్నారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలో విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు సాంప్రదాయ విద్యావిధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఎఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్సఫార్మేషన్ కష్టతరమైన పనే. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఎఐ స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ లను ప్రవేశపెడుతున్నామన్నారు. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రోజువారీ పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టి 600 రకాల పౌరసేవలను ప్రజలకు వేగవంతంగా అందిస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించబోతోందని ఆయన తెలిపారు. జి టు జి కొలాబరేషన్ లో భాగంగా యుఎఈ – ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకారం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని మేం భావిస్తున్నట్టు చెప్పారు.
ఎఐ, డేటా సెంటర్లు, డిజిటల్ ఆవిష్కరణలు, స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఫైర్ సైడ్ చాట్ లో తనకు ఇష్టమైన ఎఐ అప్లికేషన్ చాట్ జిపిటి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి జి42 ఇండియా సిఇఓ మనుజైన్ హాజరుకాగా, ప్రైమస్ పార్టనర్స్ వైస్ ప్రెసిడెంట్ రక్ష శ్రద్ధ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రా, డిజిటల్ గవర్నెన్స్, ఎఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యుఎఇ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో మంత్రి లోకేష్ చర్చించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు యుఎఇ తరపున సహకారం అందించాల్సిందిగా కోరారు. దీనికి అబ్దుల్ బిన్ స్పందిస్తూ యుఎఈ పర్యటనకు రావాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram