సీఎం జ‌గ‌న్ కు నారా లోకేష్ లేఖ‌

విధాత‌: మంగళగిరి ఎయిమ్స్ కి నీటి సరఫరా జాప్యం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి నారా లోకేష్ లేఖ రాశారు.ఎయిమ్స్ మంగళగిరికి నీటి సరఫరా సమస్య పరిష్కారం అత్యవసరం.ఎయిమ్స్ కు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి 2017 లో రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదించబడింది.2018 లో పాలనా పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి.గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.ఎయిమ్స్ కి కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.నీటి […]

  • Publish Date - August 26, 2021 / 05:55 AM IST

విధాత‌: మంగళగిరి ఎయిమ్స్ కి నీటి సరఫరా జాప్యం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి నారా లోకేష్ లేఖ రాశారు.ఎయిమ్స్ మంగళగిరికి నీటి సరఫరా సమస్య పరిష్కారం అత్యవసరం.ఎయిమ్స్ కు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి 2017 లో రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదించబడింది.2018 లో పాలనా పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి.గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.ఎయిమ్స్ కి కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.నీటి కొరత కారణంగా కోవిడ్ పై జరిగిన పోరాటంలో ముందుండాల్సిన ఎయిమ్స్ వెనుకబడింది.

ఎయిమ్స్ ఏపీతో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రజలకు ఉత్తమ సేవలందించే ప్రతిష్టాత్మక రెండు సంస్థలో ఒక్కటి.రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ ని నిర్లక్ష్యం చేయడం సరికాదు.ఎన్ హెచ్ 16కి ఎయిమ్స్ అనుసంధానం, కృష్ణా నీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్నాయి.

మంగళగిరి లేదా తెనాలి కాలువ ద్వారా పైప్‌లైన్‌తో నీటి సరఫరా సమస్యను పరిష్కరించమని ఎయిమ్స్ డైరెక్టర్ ఇప్పటికే సీఎం ను కోరారు.ఎయిమ్స్ ని వెంటాడుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు.