ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం
విధాత : ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో హిందూపురంలో ఓ వృద్ధుడు ఎండలో బ్యాంకు వద్ధకు వచ్చి వడదెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఇంటింటికి అందించేందుకు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారితో కాకుండా బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పెన్షన్ డబ్బుల తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.