ANDRAPRADESH | మత్స్యకారులకు చిక్కిన టన్నున్నర బాహుబలి టేకు చేప

కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో టన్నున్నర(1500కిలోలు) టేకు చేప చిక్కింది. మచిలీపట్నం మత్స్యకారుల పంట పండింది.

ANDRAPRADESH | మత్స్యకారులకు చిక్కిన టన్నున్నర బాహుబలి టేకు చేప

విధాత, హైదరాబాద్ : కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో టన్నున్నర(1500కిలోలు) టేకు చేప చిక్కింది. మచిలీపట్నం మత్స్యకారుల పంట పండింది. క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీశారు.. ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగపడే ఈ టేకు చేపను చెన్నైకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. భారీ చేప చిక్కడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. భారీ టేకు చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేశారు. మొదట చేపల కోసం వల వేశారని, తరువాత.. చేపలు పడ్డాయని భావించి తమవైపు లాగగా, ఎంతకీ రాకపోవడంతో చాలా సేపు ప్రయత్నించారు. ఆ తరువాత ఈ చేపను చూసి మత్స్యకారులంతా ఒక్కసారిగా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్‌ తీసుకొచ్చారు. క్రేన్ సాయంతో టేకు చేపను బయటకు తీసుకొచ్చారు. అయితే.. ఈ భారీ బాహుబలి చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఈ టేకు చేపలు అత్యంత అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు తెలిపారు. మూడు రోజుల క్రితం మత్స్యకారులు వేటకి వెళ్ళగా.. వారి వలకు చిక్కింది.. దీంతో చేపను అతి కష్టం మీద తీరానికి చేర్చారు.