విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరుపుతున్నట్లు తెలిసింది.