విధాత: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని ఏపీ హైకోర్టులో 5 అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులమని, కౌంటింగ్ జరపాలని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ నెల 27కి హైకోర్టు విచారణ వాయిదా వేసింది.