రాష్ట్ర వ్యాప్తంగా వానలు

నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి. విధాత:రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి.వచ్చే 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిసా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే […]

రాష్ట్ర వ్యాప్తంగా వానలు

నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి.

విధాత:రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి.వచ్చే 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిసా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.కాగా శుక్రవారం ఉత్తరాంధ్ర, యానాం,రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.
ఈనెల 10న కోస్తా తీరంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునన్నారు.