విధాత,కర్నూలు:గుంటూరులో పట్టపగలే బీటెక్ విద్యార్థిని నల్లపు రమశ్రీ దారుణహత్యకు పాల్పడిన శశికృష్ణకు ఉరే సరైనదని రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రవికుమార్, సీమకృష్ణ,రంగముని నాయుడు అన్నారు.వాళ్ళు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు గుంటూరులో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీను ప్రేమ పేరుతో కత్తితో పొడిచి దారుణహత్యకు పాల్పడిన శశికృష్ణకు ఉరిశిక్ష విధించాలని ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ,దిశ చట్టాలతో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పుకుంటున్నా అది కిందిస్థాయిలో కనిపించడంలేదని అందుకే ఇలాంటి ఘటనలు […]
విధాత,కర్నూలు:గుంటూరులో పట్టపగలే బీటెక్ విద్యార్థిని నల్లపు రమశ్రీ దారుణహత్యకు పాల్పడిన శశికృష్ణకు ఉరే సరైనదని రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రవికుమార్, సీమకృష్ణ,రంగముని నాయుడు అన్నారు.వాళ్ళు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు గుంటూరులో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీను ప్రేమ పేరుతో కత్తితో పొడిచి దారుణహత్యకు పాల్పడిన శశికృష్ణకు ఉరిశిక్ష విధించాలని ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ,దిశ చట్టాలతో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పుకుంటున్నా అది కిందిస్థాయిలో కనిపించడంలేదని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఓ యువతిని,కర్నూలు జిల్లా ఎర్రబాడులో హాజిరా,అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత ఇలా వివిధ ప్రాంతాల్లో మహిళలు,విద్యార్థినిలపై పదే పదే ఇలాంటి దుర్మార్గకరమైన ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇలాంటి సంఘటనలు బయటకురానివి ఎన్నో ఉన్నాయని దారుణ అఘాయిత్యాలకు పాల్పడేవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని కావున తక్షణమే నడిరోడ్డుపై కత్తితో రమ్యశ్రీ హత్యా దారుణానికి పాల్పడిన శశికృష్ణకు ఉరిశిక్ష విధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అశోక్,ఆది నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమాభివందనాలతో..
రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ(ఆర్.జేఏసీ)