ప్రయాణికులకు అలెర్ట్‌..! విజయవాడ డివిజన్‌లో వారం పాటు భారీగా రైళ్లు రద్దు..!

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

  • Publish Date - November 11, 2023 / 05:45 AM IST

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. డివిజన్‌లో పలు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.


పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 13 నుంచి 17 వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (17237), చెన్నై సెంట్రల్‌ – బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసింది. ఇక విజయవాడ – విశాఖపట్నం (22702) రైలు, విశాఖపట్నం – విజయవాడ (22701) ఈ నెల 13, 14, 15, 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొంది.


కాకినాడ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్ట్‌ (17268), రాజ‌మండ్రి – విశాఖ‌ప‌ట్నం (07466), విశాఖ‌ప‌ట్నం – రాజ‌మండ్రి (07467), మచిలీప‌ట్నం – విశాఖ‌ప‌ట్నం (17219), గుంటూరు – రాయ‌గ‌డ‌ (17243), గుంటూరు – విశాఖ‌ప‌ట్నం (17239), బిట్రగుంట – విజయవాడ బిట్ర‌గుంట – విజ‌య‌వాడ‌ (07977) విజ‌య‌వాడ – బిట్రగుంట (07978) విజ‌య‌వాడ – తెనాలి (07279), విజ‌య‌వాడ – ఒంగోలు (07461), ఒంగోలు – విజ‌య‌వాడ‌ (07576), విజ‌య‌వాడ – గూడూరు (07500) తెనాలి – విజ‌య‌వాడ‌ (07575) రైళ్లను 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.


ఇక ఈ నెల 14 నుంచి 20 వరకు విశాఖ‌ప‌ట్నం – మ‌చిలీప‌ట్నం (17220) రాయ‌గ‌డ – గుంటూరు (17244), విశాఖ‌ప‌ట్నం – గుంటూరు (17240), గూడూరు – విజ‌య‌వాడ‌ (07458) రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటితో పాటు మరికొన్ని రైళ్లను పాక్షింగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Latest News