విధాత:2021-22 ఏడాదికి సంబంధించి 3-10 తరగతుల సిలబస్ను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిలబస్ను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు సర్కులర్ జారీ చేశారు.దీనిలో భాగంగా 3-9 తరగతుల సిలబస్ 15 శాతం మేర, 10వ తరగతి సిలబస్ 20 శాతం మేర తగ్గనుంది.అలాగే పాఠశాల పనిదినాల అకడమిక్ కేలండర్ను 31 వారాల నుంచి 27 వారాలకు ప్రభుత్వం కుదించింది.దీని ప్రకారం అకడమిక్ కేలండర్ను రెండు భాగాలుగా రూపకల్పన చేసింది.