సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడి కథ… విధాత: మన భారతదేశంలో ఆయుర్వేదం వేదకాలం నుండి ఉంది. వేదాల నుండే ఆయుర్వేద శాస్త్రము వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నెల్లూరులోని ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడు తన గురువు గారి ద్వారా నేర్చుకున్న వైద్యాన్ని స్వచ్ఛందంగా ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. వీలైతే కేవలం మందు తయారీ కి […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడి కథ…
విధాత: మన భారతదేశంలో ఆయుర్వేదం వేదకాలం నుండి ఉంది. వేదాల నుండే ఆయుర్వేద శాస్త్రము వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నెల్లూరులోని ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడు తన గురువు గారి ద్వారా నేర్చుకున్న వైద్యాన్ని స్వచ్ఛందంగా ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. వీలైతే కేవలం మందు తయారీ కి మాత్రమే ద్రవ్యాన్ని తీసుకురండి అని చెబుతున్నారు ఆనందయ్య.
పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ మందు తీసుకున్న రెండు రోజుల లో నెగెటివ్ వస్తుందని పేషెంట్లు స్వతహాగా ఒప్పుకుంటున్నారు..ఆక్సిజన్ తక్కువగా ఉన్న వారికి సైతం తన మందుతో చికిత్స చేస్తున్నారు వీరు.. ఆధారాలతో నిరూపించబడిన ఈ వైద్యానికి ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ మాఫియా ను గుర్తించి నిర్మూలించి ఇలాంటి వారికి చేయూత నివ్వాలి.. ఎలాగో ఆయుష్ ఆయుర్వేద కంపెనీ కి నిన్న బ్లాక్ ఫంగస్ కోసం మందు తయారీ కి అనుమతి లభించింది ..అదే తరహాలో ఆనందయ్య మందు కూడా అనుమతి లభించాలి అని అందరూ కోరుతున్నారు..