విధాత: తూర్పుగోదావరి జిల్లా మండపేట వైసీపీలో ప్లెక్సీల వివాదం రాజుకుంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్లెక్సీల వల్ల ప్రజలకు ఇబ్బందులంటూ వాట్సప్ మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. కాగా ప్లెక్సీలపై వైసీపీ నేత వీర్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసి వాట్సప్ మెసేజ్లు పెడుతున్నాడంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెదిరించిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.