TTD | తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. శ్రీవారి కానుకలను సొంతం చేసుకోండిలా..!

TTD | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన ఖరీదైన వాచీలు, మొబైల్ ఫోన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ-వేలం ప్రక్రియను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

  • Publish Date - June 22, 2024 / 09:31 AM IST

TTD | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన ఖరీదైన వాచీలు, మొబైల్ ఫోన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ-వేలం ప్రక్రియను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ భక్తులు కానుకలుగా అందించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ ఈ-వేలం ప్రక్రియలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

ఈ వాచీల్లో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్ వెల్, ఫాస్ట్ ట్రాక్ తదితర కంపెనీలకు చెందినవి ఉన్నాయని.. మొబైల్ ఫోన్లలో వివో, నోకియా, కార్బన్, శాంసంగ్, మోటారోలా, ఒప్పో తదితర కంపెనీలవి ఉన్నాయని చెప్పింది. వాచీలను, మొబైల్ ఫోన్లను కొత్తవి, ఉపయోగించినవి, డ్యామేజీ అయినవి సైతం ఉన్నాయని.. కేటగిరీలుగా వాటిని విభజించి ఈ-వేలంలో విక్రయించనున్నట్లు పేర్కొంది. వివరాల కోసం www.tirumala.org, www.konugolu.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని కోరింది. ఇతర వివరాల కోసం 0877-2264429 ఫోన్ నంబర్లలో టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

Latest News