ఇన్నర్ వేర్లో అరాచకం సృష్టించిన పూరీ జగన్నాథ్ బ్యూటీ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ చిత్రంలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని.ఈ అమ్మడు అందాల ఆరబోతతో కుర్రకారుకి కిక్కిస్తుంటుంది. ఏ ఫొటో షేర్ చేసిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంటుంది. లోఫర్ చిత్రంలో కథానాయికగా నటించిన దిశా పటాని ఆ చిత్రంలో ఘాటు అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి మంచి వినోదం పంచింది ఆమె అందాలకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. అక్కడ స్టార్ హీరోయిన్గా , తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది.
ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది అని చెప్పాలి. దిశా పటాని తన నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. దిశా పటాని సోషల్ మీడియాలోనే కాదు వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. దిశా పటాని తరచుగా లోదుస్తుల బ్రాండ్స్ కి ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే లోదుస్తుల యాడ్ కోసం దిశా ఇన్నర్ అందాలని చూపించింది. కాల్విన్ క్లయిన్ బ్రాండ్ ఇన్నర్ వేర్లు ధరించి అదరహో అనిపించింది.
ఇక ఈ అమ్మడు టైగర్ ష్రాఫ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తుండగా, ఆ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది. కానీ ఏం జరిగిందో ఏమో కాని సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.