Gold Rates | బంగారం ధరలు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నది. దీంతో బంగారం దుకాణాలన్నీ కొనుగోలుదారులకుతో కళకళలాడుతున్నాయి. పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. అయితే, బంగారం, వెండి ధరలు బుధవారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్పై రూ.100 తగ్గి తులానికి రూ.65,450కి దిగివచ్చింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 పతనమై.. తులానికి రూ.71,510కి చేరుకుంది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.500 దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,510కి పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,660 దిగజారింది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,660 వద్ద ఉన్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,510 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం భారీగానే దిగివచ్చింది. కిలోకు రూ.500 పతనమై ఢిల్లీలో కిలోకు రూ.83వేలకు చేరింది. హైదరాబాద్లో కిలోకు రూ.88వేలు పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.