Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుసగా షాక్ ఇస్తూ వస్తున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై ఏకంగా ఒకే రోజు రూ.900 పెరిగి తులానికి రూ.67,950కి దూసుకెళ్లింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.980 పెరిగి.. తులానికి రూ.74,130కి చేరింది. అలాగే వెండి ధర సైతం మళ్లీ భారీగానే పెరిగింది. కిలోకు రూ.1000 పెరిగి కిలోకు రూ.87వేలకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,950కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,130కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,280కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.67,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,130 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో బంగారంతో వెండి సైతం పోటీ పడుతున్నది. కిలోకు రూ.1000 పెరిగడంతో రూ.87వేల మార్క్ను దాటింది. ఇక హైదరాబాద్లో కిలో వెండి రూ.90,500 పలుకుతున్నది. బంగారం, వెండి ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగడం ఇదే తొలిసారి. గత రెండుమూడు నెలలుగా బంగారం ధరలు ఎన్నడూలేని విధంగా పెరుగుతూ వస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.