OTT| ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని అలరిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు థియేటర్లో మంచి సినిమాలు సందడికి సిద్ధమవుతున్నా కూడా ఓటీటీలో వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఏప్రిల్ నాలుగో వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఈ నెల 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా… హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల్లో ఏప్రిల్ 22 నుంచి 28 మధ్య ఏకంగా 17 సినిమాలు సందడికి సిద్ధం అయ్యాయి. టిల్లు స్క్వేర్, భీమాపై స్పెషల్ ఫోకస్ ఉంది.