టాలీవుడ్ టాప్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం గుంటూరు కారం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మహేష్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా,. ముచ్చగా మూడోసారి వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా కనిపించి సందడి చేసింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. చిత్రంలో మహేష్, రమ్యకృష్ణలని తల్లి కొడుకులుగా చూసిన ఫ్యాన్స్ ఖంగుతిన్నారు.
అందుకు కారణం ఏంటంటే.. 2004లో మహేష్ బాబు, SJ సూర్య కాంబోలో ‘నాని’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఆ సినిమాలో రమ్యకృష్ణ, మహేష్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ‘మార్కండేయా’ అంటూ సాగే ఈ పాటలో రమ్యకృష్ణ అందాల ఆరబోతతో ఆకట్టుకోగా, మహేష్ రొమాన్స్తో రెచ్చిపోయాడు. ఈ పాటని సినిమా నుండి తొలగించారు. కాని ఈ పాట యూట్యూబ్ లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే గుంటూరు కారం సినిమాలో మహేష్, రమ్యకృష్ణ కలిసి కనిపించడంతో పాత పాట నెట్టింట వైరల్ అవుతుంది.
‘నాని’ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు తల్లిగా నటించడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నటీనటులు అన్నాక ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయకతప్పదు. ఏ పాత్రలో అయిన సరిగ్గా ఒదిగిపోతేనే వారు సంపూర్ణ నటులు అనిపించుకుంటారని వెల్లడిస్తున్నారు. అన్నా చెల్లెల్లుగా నటించిన వాళ్లు, భార్యాభర్తలుగా నటించడం, తండ్రి కూతుళ్లుగా నటించిన వారు, వైఫ్ అండ్ హస్బెండ్ గా నటించడం ఇప్పటికే పలు సినిమాల్లో చూశామని, ఇప్పుడు రమ్యకృష్ణ .. మహేష్ బాబుకి తల్లిగా కనిపించడంలో పెద్ద వింతేమి లేదని కొందరు అంటున్నారు.