Trisha | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ను మలుపుతప్పింది. 2004లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది. ఇక సినిమాతో ప్రభాస్ రేంజ్ విపరీతంగా పెరిగింది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్పై ఎంఎస్రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. శోభన్ దర్శకత్వం వహించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ విలన్ పాత్రలో అద్భుత నటనను కనబరిచారు.
Trisha | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ను మలుపుతప్పింది. 2004లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది. ఇక సినిమాతో ప్రభాస్ రేంజ్ విపరీతంగా పెరిగింది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్పై ఎంఎస్రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. శోభన్ దర్శకత్వం వహించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ విలన్ పాత్రలో అద్భుత నటనను కనబరిచారు. మూవీలో ప్రభాస్-త్రిష జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ జోడీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీతో త్రిష క్రేజ్ సైతం భారీగా పెరిగింది. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడం వరుస అవకాశాలతో టాలీవుడ్లో అగ్రహీరోయిన్గా అదిగింది. అయితే, వర్షం మూవీలో మొదట త్రిషను హీరోయిన్గా అనుకోలేదట.
మొదట మరో యంగ్ హీరోయిన్ను తీసుకోవాలని భావించారు. చివరకు ఈ అవకాశం త్రిషకు దక్కింది. ఆ అవకాశం మొదట వచ్చింది గంగోత్రితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదిథి అగ్వాల్కు. గంగోత్రి సినిమాలో నటనతో అందాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను బాగా అలరించింది. దాంతో వర్షంలో హీరోయిన్గా తీసుకోవాలని మొదట చిత్ర యూనిట్ భావించింది. అయితే, పలు కారణాలతో ఈ ప్లేస్లో త్రిషను తీసుకున్నారు. అయితే, ఈ ఛాన్స్ మిస్సయిన అదితి అగర్వాల్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ప్రస్తుతం త్రిష కెరీర్లో దూసుకుపోతున్నది. నాలుగు పదుల వయసులోనూ అగ్రహీరోయిన్గా కొనసాగుతున్నది. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ సైడ్ అయిపోగా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. చివరిసారిగా విజయ్ దళపతి ‘లియో’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో విదా ముయార్చి, థగ్లైఫ్ చిత్రాల్లో నటిస్తున్నది. అలాగే, మళయాలంలో రామ్, ఐడెంటీతో పాటు తెలుగులో ‘విశ్వంభర’లో మెగాస్టార్ చిరంజీవితో జతకడుతున్నది.