రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్న శశికృష్ణ.. ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేశాడు. విధాత:ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రమ్యను హత్య చేసిన సీసీ ఫుటేజ్ ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా నిందితుడు శశికృష్ణ.. ఆమెను చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజే అతడు రెక్కీ నిర్వహించి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. పోలీసుల విచారణలో శశికృష్ణ.. […]
రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్న శశికృష్ణ.. ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేశాడు.
విధాత:ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రమ్యను హత్య చేసిన సీసీ ఫుటేజ్ ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా నిందితుడు శశికృష్ణ.. ఆమెను చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజే అతడు రెక్కీ నిర్వహించి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. పోలీసుల విచారణలో శశికృష్ణ.. హత్యకు ఎలా స్కెచ్ వేశాడు. ఏ విధంగా అమలు చేశాడు అనేదానిపై ప్రశ్నించగా కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇద్దరికీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులు ఇష్టాఇష్టాలు పంచుకున్నారు. ఇద్దరూ స్నేహంగా మెలిగారు. కొన్నిరోజుల తర్వాత తనను ప్రేమించాలని కోరాడు. దీంతో రమ్య అతడి ప్రపోజల్ తిరస్కరించింది. శశికృష్ణ వేధింపులు ఎక్కువకావడంతో అతడి ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది. దీంతో శశికృష్ణ.. రమ్య స్వగ్రామానికి వెళ్లి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు.
హత్య చేశాడిలా..
రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్న శశికృష్ణ.. ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేశాడు. రమ్య కాలేజీకి వస్తుందా లేదా అని తెలుసుకునేందుకు ఈనెల 14న బుడంపాడులో రెక్కీ నిర్వహించాడు. తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై కాలేజీ వద్దకు వెళ్లాడు. బస్సు దిగుతూ శశికృష్ణను చూసిన రమ్య అక్కడి నుంచి కాలేజీలోకి పరుగులు పెట్టింది. అదే రోజు సాయంత్రం మరోసారి కాలేజీకి వెళ్లాడు. ఐతే అప్పటికే రమ్య ఇంటికి వెళ్లిపోవడంతో తన ఫ్రెండ్ దగ్గర కత్తితీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 15న ఉదయం కాకాని రోడ్డులో రమ్య కోసం మాటు వేశాడు. అదే సమయంలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆమె ఫోన్ కూడా లాక్కున్నాడు. ఐతే టిఫిన్ ఇంట్లో ఇచ్చి ఫోన్ కోసం మళ్లీ వచ్చిన రమ్యను బైక్ ఎక్కాలని బలవంత పెట్టాడు. ఈ క్రమంలో శశికృష్ణ దగ్గర ఫోన్ లాక్కొని ఇంటికి వెళ్లిపోతున్న రమ్యను అడ్డగించి కత్తితో పొడిచి హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం శశికృష్ణ పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు. పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు వెళ్లగా.. కత్తితో చేతిపై గాట్లు పెట్టుకొని పోలీసులకు కూడా బెదిరించాడు. ఐతే అతడ్ని చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే రమ్య హత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితుడ్ని ఉరితీయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.