విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Road Accident | హన్మకొండ జిల్లా, పరకాల పట్టణంలోని చలి వాగు వద్ద బుధవారం ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు కూలీలకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు కూలీల పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలు చెల్లచెదరుగా పడిపోయారు.
కూలీలు శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వారీగా తెలుస్తోంది. పత్తిపాక నుండి రేగొండ మండలంలోని పోచంపల్లి గ్రామానికి కూలి పనికి వెళ్తుండగా భూపాల పల్లి నుండి హన్మకొండకు వెళ్లే కారు ఢీకొనడంతో అటో బోల్తా పడినట్లు తెలిసింది. క్షతగాత్రులను పరకాల పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.