పర్సులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఏటీఎంలు, డబ్బులు, తాళం చెవి, తమ పూర్వీకుల ఫొటోలతో పాటు రకరకాల ఐటెమ్స్ పెడుతుంటారు. అయితే పర్సులో అనవసరమైన వస్తువులు పెట్టడంతో ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్క యువకుడు పర్సును మెయింటెన్ చేస్తుంటారు. ఆ పర్సులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఏటీఎంలు, డబ్బులు, తాళం చెవి, తమ పూర్వీకుల ఫొటోలతో పాటు రకరకాల ఐటెమ్స్ పెడుతుంటారు. అయితే పర్సులో అనవసరమైన వస్తువులు పెట్టడంతో ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూర్వీకుల ఫొటోలు పెట్టుకోకూడదట..!
మరి వాస్తు శాస్త్ర ప్రకారం పర్సులో పూర్వీకుల ఫొటోలను పెట్టుకోకూడదట. అలాంటి ఫొటోలు పెట్టుకోవడం శుభప్రదం కాదని చెబుతున్నారు. ఎందుకంటే పర్సులో డబ్బులు పెడుతాం. అంటే అది లక్ష్మీదేవి నివాసం అని చెప్పొచ్చు. అలాంటి ప్లేస్లో చనిపోయిన వారి ఫొటోలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి మన నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందట. ఈ కారణంగా మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని వాస్తుపండితులు చెబుతున్నారు.
తాళం చెవి కూడా మంచిది కాదట..!
చాలా మంది పర్సులో తమ ఇంటి తాళాలను పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో తాళం చెవితో పాటు లోహంతో తయారు చేసిన ఏ ఇతర వస్తువులు ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అలా ఉంచడం ద్వారా డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుందని వాస్తునిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు ఆ అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండని సూచిస్తున్నారు.
నలుపు రంగు వస్తువులు కూడా వద్దట..!
అలాగే పర్సులో వాస్తుప్రకారం నలుపు రంగు వస్తువులను ఉంచడం మంచిది కాదట. ఎందుకంటే నలుపు రంగు డబ్బు నష్టానికి సంకేతం. కాబట్టి ఆ కలర్ వస్తువులను పర్సులో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చిరిగిన నోట్లతో లక్ష్మీదేవికి కోపం..!
చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఏదైనా కరెన్సీ నోటు చిరిగితే.. తీసేయకుండా అలాగే పర్సులోనే ఉంచుతుంటారు. అయితే వాస్తుప్రకారం చిరిగిపోయిన కరెన్సీ నోటును ఉంచవద్దు. ఇలా ఉంచడం లక్ష్మీదేవి కోపానికి గురై విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు వాస్తు నిపుణులు.