యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా 69లక్షల10,200 రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 96లక్షల 50,650, ఆర్జిత సేవల ద్వారా 1కోటి 34లక్షల 56,805, వ్రతమండపం ద్వారా 43లక్షల 37,300, ప్రసాద విక్రయం ద్వారా 3కోట్ల 5లక్షల 8,630, హుండీ ద్వారా 2కోట్ల 33లక్షల 53,382, విచారణ శాఖ ద్వారా 24లక్షల 37,318రూపాయలు, ఇతరముల ద్వారా 5 కోట్ల 58లక్షల 51,264రూపాయల ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. అలాగే శనివారం స్వామివారి ఒక్క రోజు ఆదాయం 38 లక్షల 67,352 రూపాయలు సమకూరిందని తెలిపారు.