విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకుతెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. గతంలోనే వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆ సడలింపును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.
ఈ వయోపరిమితి సడలింపు ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
National Highways | అమ్మకానికి 28 హైవేలు.. రూ.35 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం భారీ స్కెచ్!
